March 16, 2026
ipl2026: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ మ్యాచ్లను బెంగళూరులో నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం విధాన సౌధలో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భద్రతా ఏర్పాట్లు, ప్రేక్షకుల నియంత్రణ చర్యలపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం మ్యాచ్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Read More



