
February 3, 2026
cm chandrababu:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో ప్రధాని మోదీ ఒప్పందంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. అమెరికాతో భారత్ కుదుర్చుకున్న తాజా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.





_1769581907063.jpg)
_1769167964382.jpg)









_1767758448927.jpg)
_1767701205372.png)
_1767585586989.jpg)


_1767336712146.jpg)

_1767238621357.jpg)





