
February 25, 2026
rebel star prabhas:పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఒకప్పుడు భారీ ఆశలతో ముందుకు వెళ్లారు. రెబెల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కలిసి చేసిన చిత్రం ది రాజాసాబ్ భారీ అంచనాల మధ్య జనవరిలో విడుదలైంది. కానీ సంక్రాంతి సీజన్లో వచ్చిన ఈ హారర్-కామెడీ ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.కొన్ని వారాల తర్వాత.. ప్రభాస్, విశ్వ ప్రసాద్ మధ్య కీలకమైన సమావేశం జరిగింది. “ఈ నష్టాన్ని నేను నా వంతుగా పూడ్చాలి,” అని ప్రభాస్ చెప్పినట్టు పరిశ్రమలో వార్తలు వినిపించాయి.తన పారితోషికాన్ని తగ్గించుకోవడమే కాకుండా, భవిష్యత్తులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోసం మరో సినిమా చేయడానికి సిద్ధమని హామీ ఇచ్చాడట.




_1772013064274.jpg&w=2560&q=75)

