Home/Tag: national news
Tag: national news
FASTag : వాహనదారులకు షాక్..
FASTag : వాహనదారులకు షాక్..

March 14, 2026

fastag price hike : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఆర్థిక భారాలు తప్పడం లేదు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (nhai) వార్షిక టోల్ పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా జరిగే టోల్ సమీక్షలో భాగంగా ఈసారి స్వల్ప పెంపును ప్రకటించింది.

Read More
President Droupadi Murmu:తృణమూల్ నేతలకు షాక్.. అపాయింట్‌మెంట్ లేదన్న ద్రౌపదీ ముర్ము
President Droupadi Murmu:తృణమూల్ నేతలకు షాక్.. అపాయింట్‌మెంట్ లేదన్న ద్రౌపదీ ముర్ము

March 13, 2026

president who did not give appointment to trinamool leaders:భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకులకు నిరాశ ఎదురైంది. సమయాభావం కారణంగా ప్రస్తుతం సమావేశం సాధ్యం కాదని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. పశ్చిమబెంగాల్‌లో ఆదివాసీలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి రాష్ట్రపతికి వివరించేందుకు టీఎంసీకి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సమావేశానికి అనుమతి కోరింది. అయితే అధ్యక్షురాలి కార్యాలయం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.

Read More
Chennai:కస్టమర్లకు షాక్.. చెన్నైలో టిఫిన్ బిల్లులో గ్యాస్ ఛార్జ్…
Chennai:కస్టమర్లకు షాక్.. చెన్నైలో టిఫిన్ బిల్లులో గ్యాస్ ఛార్జ్…

March 13, 2026

gas charge in tiffin bill in chennai:చెన్నైలోని పెరుంగుడి ప్రాంతంలో ఒక హోటల్ టిఫిన్ బిల్లులో గ్యాస్ వినియోగ ఛార్జ్ వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మనం ఎక్కడైనా టిఫిన్ చేసినప్పుడు ఆహార ధర మాత్రమే బిల్లులో ఉంటుంది. అయితే చెన్నైలోని ఈ హోటల్ మాత్రం ఇడ్లీ, వడ ధరతో పాటు గ్యాస్ వినియోగానికి కూడా ప్రత్యేకంగా డబ్బు వసూలు చేయడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Read More
Kerosene: మళ్లీ కిరోసిన్ రోజులు..!
Kerosene: మళ్లీ కిరోసిన్ రోజులు..!

March 12, 2026

kerosene: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గ్యాస్ సిలిండర్ లేని వంటగదిని ఊహించుకోవడం కష్టం. అయితే, పాత రోజుల్లో కిరోసిన్ స్టౌవ్ వెలిగించి, ఆ శబ్దంతో వంటలు చేసిన జ్ఞాపకాలు చాలామందికి ఉండే ఉంటాయి. ఇప్పుడు అవే పాత రోజులు మళ్లీ పలకరించబోతున్నాయా అంటే 'అవును' అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

Read More
Farooq Abdullah:వివాహ వేడుకలో కాల్పుల కలకలం.. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
Farooq Abdullah:వివాహ వేడుకలో కాల్పుల కలకలం.. ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం

March 12, 2026

firing at a wedding ceremony:జమ్మూలో జరిగిన ఒక ప్రముఖ వివాహ వేడుకలో సంచలన ఘటన చోటు చేసుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా‌పై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఆ గుండు లక్ష్యాన్ని తప్పడంతో ఆయన ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

Read More
Supreme Court:హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. దేశంలో తొలి కారుణ్య మరణం
Supreme Court:హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. దేశంలో తొలి కారుణ్య మరణం

March 11, 2026

supreme court:దేశ అత్యున్నత న్యాయస్థానం హరీష్ రాణా కేసులో కీలకమైన తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా ‘పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్’ (pvs)లో ఉన్న 31 ఏళ్ల హరీష్ రాణాకు పాసివ్ యూథనేసియా (కారుణ్య మరణం)కు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా దేశంలో మెర్సీ కిల్లింగ్‌కు న్యాయస్థానం స్పష్టంగా అనుమతి ఇచ్చిన అరుదైన ఘటనగా ఇది నిలిచింది.

Read More
Increase in air fares:మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. విమాన ఛార్జీలు పెంచనున్న ఎయిర్ ఇండియా
Increase in air fares:మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. విమాన ఛార్జీలు పెంచనున్న ఎయిర్ ఇండియా

March 11, 2026

increase in air fares:మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాన విమానయాన సంస్థ ఎయిన్ ఇండియా (air india) కీలక నిర్ణయం తీసుకుంది. జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతో, మార్చి 12 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై అదనంగా ఫ్యూయల్ సర్‌చార్జ్ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

Read More
Lok Sabha: దద్దరిల్లిన లోక్‌సభ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?
Lok Sabha: దద్దరిల్లిన లోక్‌సభ.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?

March 10, 2026

lok sabha: 2026 బడ్జెట్ సమావేశాలు భారత పార్లమెంటరీ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా అత్యంత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. సాధారణంగా బడ్జెట్ అంశాల చుట్టూ తిరగాల్సిన సభ, ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలన్న కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ తీర్మానం చుట్టూ తిరుగుతోంది.

Read More
T20 World Cup: ఆటలో ఆధ్యాత్మికత వద్దు.. టీమ్ ఇండియా సక్సెస్‌పై కీర్తి ఆజాద్ 'బౌన్సర్'..!
T20 World Cup: ఆటలో ఆధ్యాత్మికత వద్దు.. టీమ్ ఇండియా సక్సెస్‌పై కీర్తి ఆజాద్ 'బౌన్సర్'..!

March 10, 2026

t20 world cup: టీమ్ ఇండియా సాధించిన టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆలయాలకు తీసుకెళ్లడంపై 1983 ప్రపంచ కప్ విజేత కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ఒక మేధోపరమైన చర్చకు దారితీశాయి.

Read More
Mumbai:వంట గ్యాస్ కొరత.. అక్కడ 20శాతం హోటళ్లు మూసివేత
Mumbai:వంట గ్యాస్ కొరత.. అక్కడ 20శాతం హోటళ్లు మూసివేత

March 10, 2026

mumbai:భారత దేశంలో చమురు, గ్యాస్ కొరత వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తుంది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓ వైపు కేంద్ర సర్కార్ చెప్పినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరత వలన మహానగరమైన ముంబైలోని 20శాతం హోటళ్లు మూసివేయబడ్డాయి.

Read More
Delhi Liquor Scam: కేజ్రీవాల్, కవితలకు మళ్లీ మొదలైన టెన్షన్.!
Delhi Liquor Scam: కేజ్రీవాల్, కవితలకు మళ్లీ మొదలైన టెన్షన్.!

March 9, 2026

delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు ఒక హై-వోల్టేజ్ లీగల్ డ్రామాలా మారిపోయింది. కొద్దిరోజుల క్రితం వరకు అంతా ఊపిరి పీల్చుకున్న తరుణంలో, సీబీఐ వేసిన అడుగు ఈ కేసును మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 27, 2026న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Read More
CEC Gyanesh Kumar: సీఈసీపై అభిశంసన అస్త్రం!
CEC Gyanesh Kumar: సీఈసీపై అభిశంసన అస్త్రం!

March 9, 2026

cec gyanesh kumar: భారత రాజకీయ యవనికపై ఇప్పుడు ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంటోంది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ విపక్షాలు ఒక భారీ వ్యూహాన్ని రచించాయి.

Read More
Kolkata:కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయం నల్ల జెండాలతో నిరసనలు.. ఎందుకంటే..?
Kolkata:కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయం నల్ల జెండాలతో నిరసనలు.. ఎందుకంటే..?

March 9, 2026

kolkata:సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు కోల్‌కతాలో జరిగిన ఒక ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయం వద్ద ప్రార్థనలు చేయడానికి వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు కొందరు స్థానికులు నల్ల జెండాలు చూపిస్తూ నిరసన తెలిపారు.

Read More
Delhi:ఢిల్లీ లిక్కర్ కేసు‌లో కొత్త మలుపు.. 23 మందికి హైకోర్టు నోటీసులు
Delhi:ఢిల్లీ లిక్కర్ కేసు‌లో కొత్త మలుపు.. 23 మందికి హైకోర్టు నోటీసులు

March 9, 2026

delhi liquor policy case:దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ జనజాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read More
Shivakumar:కర్ణాటకలో సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌తో ఊహాగానాలు!
Shivakumar:కర్ణాటకలో సీఎం కుర్చీపై మళ్లీ చర్చలు.. డీకే శివకుమార్ ఢిల్లీ టూర్‌తో ఊహాగానాలు!

March 9, 2026

dk sivakumar delhi tour:కర్ణాటక రాజకీయాల్లో మరోసారి నాయకత్వ మార్పు చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల చేసిన న్యూఢిల్లీ పర్యటన ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Read More
Budget Sessions of Parliament:స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. పార్లమెంట్‌లో వేడెక్కనున్న చర్చలు.. ఎన్డీఏ మెజారిటీతో ఫలితం ముందే ఖాయం?
Budget Sessions of Parliament:స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం.. పార్లమెంట్‌లో వేడెక్కనున్న చర్చలు.. ఎన్డీఏ మెజారిటీతో ఫలితం ముందే ఖాయం?

March 9, 2026

budget sessions of parliament:దేశంలో ఎండలు ముదురుతున్న వేళ రాజకీయంగా కూడా వేడి పెరగబోతోంది. మార్చి 9 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా అందరి దృష్టి ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైనే ఉంది. స్పీకర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. 118 మంది విపక్ష ఎంపీలు ఈ నోటీసు ఇచ్చారు. దీంతో సమావేశాల మొదటి రోజే సభలో తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉంది.

Read More
Delhi:ఢిల్లీ–గోవా విమానంలో బీడీ తాగిన ప్రయాణికుడు.. కేసు నమోదు
Delhi:ఢిల్లీ–గోవా విమానంలో బీడీ తాగిన ప్రయాణికుడు.. కేసు నమోదు

March 9, 2026

delhi:ఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న అకాసా ఎయిర్ విమానంలో బీడీ తాగినందుకు ఒక ప్రయాణికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విమాన ప్రయాణ సమయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులలో ఆందోళన కలిగించింది.

Read More
Gulf:గల్ఫ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. స్వదేశానికి 52వేల మంది
Gulf:గల్ఫ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. స్వదేశానికి 52వేల మంది

March 8, 2026

gulf:అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ముఖ్యంగా అమెరికా స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాల వైపు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలు కూడా ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆ దేశాల్లో పనిచేస్తున్న, నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read More
Murder in Bengaluru:ప్రేమికుడితో కలిసి భర్త హత్య.. 20 రోజుల్లో ప్రేమికుడితో పెళ్లి..  పోలీసుల దర్యాప్తులో బయటపడిన నిజం
Murder in Bengaluru:ప్రేమికుడితో కలిసి భర్త హత్య.. 20 రోజుల్లో ప్రేమికుడితో పెళ్లి.. పోలీసుల దర్యాప్తులో బయటపడిన నిజం

March 7, 2026

murder in bengaluru:కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట గుండెపోటుతో మరణించాడని భావించిన వ్యక్తి అసలు హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

Read More
Bihar:నితీష్ తర్వాత బిహార్ సీఎం ఎవరు..? బీజేపీ చర్చలో ఆరు పేర్లు
Bihar:నితీష్ తర్వాత బిహార్ సీఎం ఎవరు..? బీజేపీ చర్చలో ఆరు పేర్లు

March 7, 2026

who is cm of bihar:బిహార్ రాజకీయాల్లో మరోసారి కీలకమైన మార్పులపై చర్చ మొదలైంది. రాష్ట్రాన్ని పదిసార్లు ముఖ్యమంత్రిగా నడిపించిన నితీశ్ కుమార్ రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆయన స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More
Bengal:బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా వివాదం.. ధర్నాకు మమతా పిలుపు
Bengal:బెంగాల్ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా వివాదం.. ధర్నాకు మమతా పిలుపు

March 6, 2026

bengal:పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఓటర్ల జాబితా నుంచి చట్టబద్ధమైన పేర్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(tmc) శుక్రవారం కోల్‌కతాలో ధర్నా నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ మెట్రో ఛానల్ వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనార్జీ ప్రకటించారు.

Read More
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు
Transfers of Governors:దేశవ్యాప్తంగా పరిపాలనా మార్పులు.. తొమ్మిది రాష్ట్రాల్లో గవర్నర్లు, ఎల్‌జీల బదిలీలు

March 6, 2026

transfers of governors:దేశవ్యాప్తంగా కీలకమైన పరిపాలనా మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఢిల్లీతో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ నియామకాలను వెల్లడించింది.

Read More
Tamil Nadu:విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఓట్ల చీలికతో మళ్లీ స్టాలిన్‌కే అవకాశం?
Tamil Nadu:విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. ఓట్ల చీలికతో మళ్లీ స్టాలిన్‌కే అవకాశం?

March 5, 2026

assembly elections in tamil nadu:తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికర దశలోకి ప్రవేశించాయి. గతంలో ఈ రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా రెండు పెద్ద పార్టీలైన డీఎంకే, aiadmk చుట్టూనే తిరిగేవి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం తమిళ ఓటర్ల ప్రత్యేకతగా మారింది.చరిత్రను బట్టి చూస్తే ఈసారి అన్నాడీఎంకేకు అవకాశం రావాలి. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

Read More
CM Nitish:బిహార్ సీఎం నితీశ్ కీలక ప్రకటన..
CM Nitish:బిహార్ సీఎం నితీశ్ కీలక ప్రకటన..

March 5, 2026

bihar cm nitish's key announcement:బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Read More
Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు
Prime Minister Modi:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీ, బహ్రెయిన్ పాలకులతో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు

March 2, 2026

prime minister modi:అమెరికా–ఇరాన్ వివాదం తీవ్రరూపం దాల్చి పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరాన్‌పై జరిగిన దాడులు, తదనంతరం జరిగిన ప్రతిదాడుల నేపథ్యంలో ప్రాంతీయ శాంతి, భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ దాడులను ఆయన ఖండించారు.

Read More
Page 1 of 67(1652 total items)