
February 2, 2026
high speed train:కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి కీలకమైన హైస్పీడ్ రైలు కారిడార్లను కేంద్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హైస్పీడ్ కారిడార్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య ప్రయాణాలు ఇక మరింత సులభమవుతాయన్నారు. హైదరాబాద్ నుంచి కేవలం రెండు గంటల్లోనే బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. హైస్పీడ్ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Read More


