Home/Tag: Hyderabad News
Tag: Hyderabad News
Telangana Assembly: తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా
Telangana Assembly: తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా

March 20, 2026

telangana assembly: తెలంగాణ శాసనసభలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉత్కంఠభరితమైన పరిణామాలు ముగిశాయి. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించిన అనంతరం, స్పీకర్ సభను సోమవారానికి (మార్చి 23) వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం సుమారు రెండు గంటల పాటు సాగింది. రూ. 3,24,234 కోట్ల భారీ వ్యయంతో కూడిన ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం "ప్రజా బడ్జెట్"గా అభివర్ణించింది.

Read More
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌.. శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌.. శాసనసభలో ప్రవేశపెట్టిన భట్టి

March 20, 2026

telangana budget: తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అదించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ అడుగు జాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Read More
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య

March 20, 2026

hyderabad metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఇవాళ శుక్రవారం సాంకేతిక సమస్యతో చేదు అనుభవం ఎదురైంది. నిత్యం వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణించే బ్లూ లైన్ (blue line) మార్గంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

Read More
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ పురస్కారం..
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ పురస్కారం..

March 20, 2026

shamshabad airport: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (shamshabad airport) (rgia) అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన సత్తా చాటింది. లండన్‌లో జరిగిన స్కైట్రాక్స్ (skytrax) వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్-2026లో మన విమానాశ్రయం ప్రతిష్టాత్మక పురస్కారాలను కైవసం చేసుకుంది. హైదరాబాద్ విమానాశ్రయం (shamshabad airport) కేవలం సౌకర్యాలకే కాకుండా, అక్కడ పనిచేసే సిబ్బంది అందించే అద్భుతమైన సేవలకు కూడా గుర్తింపు పొందింది. ముఖ్యంగా 'బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్' విభాగంలో వరుసగా ఐదవసారి అవార్డు అందుకోవడం విశేషం.

Read More
Rain Alert: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ
Rain Alert: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

March 20, 2026

rain alert: హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం.. రానున్న రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ కింది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, నల్గొండ ప్రభావిత అవుతాయని తెలిపింది.

Read More
Hyderabad:ద్రోణి ప్రభావం.. తెలంగాణలో రెండు రోజులు ఈదురుగాలులతో వర్షాలు
Hyderabad:ద్రోణి ప్రభావం.. తెలంగాణలో రెండు రోజులు ఈదురుగాలులతో వర్షాలు

March 17, 2026

hyderabad:కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారాయి. సోమవారం అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్ వంటి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి.

Read More
Pratyusha death case:సినీనటి ప్రత్యూష మృతి కేసులో కీలక మలుపు.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
Pratyusha death case:సినీనటి ప్రత్యూష మృతి కేసులో కీలక మలుపు.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి

March 16, 2026

pratyusha death case:తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థరెడ్డి అమెరికా నుంచి భారత్‌కు వచ్చి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని చెప్పడంతో అతడు భారత్‌కు తిరిగి వచ్చి కోర్టు ముందు హాజరయ్యాడు.

Read More
Shamshabad Airport: భారీ డ్రోన్ స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్టు
Shamshabad Airport: భారీ డ్రోన్ స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్టు

March 16, 2026

shamshabad airport: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (rgia) వేదికగా జరుగుతున్న అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సింగపూర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న భారీ డ్రోన్ స్మగ్లింగ్‏ (drone smuggling)ను అధికారులు గుర్తించారు.

Read More
Telangana Weather Update:తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుంది.. మూడు రోజులు అలర్ట్ జారీ
Telangana Weather Update:తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతుంది.. మూడు రోజులు అలర్ట్ జారీ

March 7, 2026

telangana weather update:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More
Virosh:హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు ఆహ్వానం ఉన్నవారికే ఎంట్రీ… అభిమానులకు కీలక విజ్ఞప్తి..!
Virosh:హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు ఆహ్వానం ఉన్నవారికే ఎంట్రీ… అభిమానులకు కీలక విజ్ఞప్తి..!

March 1, 2026

virosh:టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో విజయ్ –రష్మిక జంట ఒక కీలక నిర్ణయం తీసుకుని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Read More
HarishRao sensational comments:రేవంత్ రెడ్డికి దేవుడంటే విశ్వాసం లేదేమో.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు
HarishRao sensational comments:రేవంత్ రెడ్డికి దేవుడంటే విశ్వాసం లేదేమో.. హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

February 28, 2026

harishrao sensational comments:మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయిందని, ఇప్పుడు దేవాలయాలపై దృష్టి పెట్టారా అని ప్రశ్నించారు. కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతంలోని విశాఖ శారద పీఠం ఆధ్వర్యంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read More
Fire accident in Hyderabad:నగరంలో మరో ప్రమాదం.. జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు
Fire accident in Hyderabad:నగరంలో మరో ప్రమాదం.. జూబ్లీహిల్స్‌లోని మంగళగౌరి వస్త్ర దుకాణంలో చెలరేగిన మంటలు

February 26, 2026

fire accident in hyderabad:హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు అగ్ని ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఇవాళ జూబ్లిహిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు నంబర్ 36లో మంగళగౌరి దుస్తుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read More
YouTuber suicide:యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే..?
YouTuber suicide:యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే..?

February 25, 2026

youtuber komali commits suicide:హైదరాబాద్ నగరంలో యువ యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ప్రేమ విఫలమవ్వడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలి కాలంలో యువతలో ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగ ఒత్తిడులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Read More
CP Sajjanar:అమ్మాయిలూ జాగ్రత్త.. పెళ్లికి ముందు అలాంటివి చేయవద్దు: సీపీ సజ్జనార్
CP Sajjanar:అమ్మాయిలూ జాగ్రత్త.. పెళ్లికి ముందు అలాంటివి చేయవద్దు: సీపీ సజ్జనార్

February 23, 2026

be careful girls cp sajjanar:తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు సీపీ సజ్జనార్. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, ముఖ్యంగా యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా” అని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించారు.

Read More
Ramachander Rao:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్..
Ramachander Rao:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్..

February 22, 2026

ramachander rao:రామచందర్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన ఆయనను ఈరోజు ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. తన నివాసం నుంచి బాన్సువాడకు బయల్దేరుతుండగా పోలీసులు అడ్డుకుని ముందుగా హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే బయటకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టు చేశారు.

Read More
Fire accident in Hyderabad:నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అగ్నిప్రమాద ఘటన.. డేటా రికవరీ కష్టమే
Fire accident in Hyderabad:నాంపల్లి ఎఫ్‌ఎస్‌ఎల్‌లో అగ్నిప్రమాద ఘటన.. డేటా రికవరీ కష్టమే

February 21, 2026

fire accident in hyderabad:తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. నాంపల్లిలోని ఈ ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఈనెల 7న మంటలు చెలరేగిన ఘటనలో భారీ నష్టం సంభవించింది. కాలిపోయిన ఫైల్స్‌పై పరిశీలన జరిపిన నాగ్‌పూర్ ప్రత్యేక బృందం సుమారు 1100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయని వెల్లడించింది.

Read More
Fire accident in Hyderabad:కేపీహెచ్‌బీలో భారీ అగ్ని ప్రమాదం.. మొబైల్ షాపు దగ్ధం
Fire accident in Hyderabad:కేపీహెచ్‌బీలో భారీ అగ్ని ప్రమాదం.. మొబైల్ షాపు దగ్ధం

February 21, 2026

fire accident in hyderabad:హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ బస్టాప్ సమీపంలోని పద్మావతి ప్లాజాలోని సాయి మొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షాపు మొత్తం దగ్ధమైంది.

Read More
Fire accident in Hyderabad:అమీర్‌పేటలో అగ్ని ప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ
Fire accident in Hyderabad:అమీర్‌పేటలో అగ్ని ప్రమాదం.. కోచింగ్ సెంటర్‌లో దట్టమైన పొగ

February 20, 2026

fire accident in hyderabad:హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైత్రీవనం చౌరస్తాలోని నీలగిరి బ్లాక్ భవనంలో 4వ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read More
murder in Hyderabad:రెండో పెళ్లి చేసుకుందని కక్షతో.. మహిళను కిరాతకంగా చంపిన మాజీ భర్త
murder in Hyderabad:రెండో పెళ్లి చేసుకుందని కక్షతో.. మహిళను కిరాతకంగా చంపిన మాజీ భర్త

February 19, 2026

murder in hyderabad:హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం గ్రీన్‌సిటీ కాలనీలో నాలుగు నెలల గర్భిణిని ఆమె మాజీ భర్త కిరాతకంగా హత్య చేసిన కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వివరాలు చూస్తే, ఇది ఒక్కసారిగా జరిగిన కోపోద్రిక్త ఘటన కాదని, ముందే ప్లాన్ చేసి చేసిన హత్య అని స్పష్టమవుతోంది.

Read More
Shikha Goyal:నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. ఆ ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు
Shikha Goyal:నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. ఆ ఆధారాలపై శిఖా గోయల్ కీలక వ్యాఖ్యలు

February 8, 2026

shikha goyal keynotes:నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం అగ్ని ప్రమాదం జరిగిని విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై కొంతమంది అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. వాటిని ఆ సంస్థ డైరెక్టర్ శిఖా గోయల్ ఖండించారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై అసత్య ప్రచారాలు చేయవద్దు అని సూచించారు

Read More
Hyderabad: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య
Hyderabad: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య

January 31, 2026

hyderabad: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చర్లపల్లి- ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. మృతులు బోడుప్పల్ పరిధిలోని హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతన్‌గా రైల్వే అధికారులు గుర్తించారు.

Read More
Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రూ.6లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు
Hyderabad: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రూ.6లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు

January 31, 2026

hyderabad: హైదరాబాద్‌ నగరంలోని కోఠి ఏరియాలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.

Read More
Hyderabad:హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువకుడు హల్‌చల్..
Hyderabad:హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువకుడు హల్‌చల్..

January 30, 2026

drunken youth had a fight with the police in hyderabad:హైదరాబాద్‌లో జనసేన పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు, ఇన్‌స్టాగ్రామర్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి చేసిన మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం రాజకీయ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Read More
Kalvakuntla Kavitha: సిట్ విచారణ సీరియస్‌గా జరగడం లేదు: కవిత
Kalvakuntla Kavitha: సిట్ విచారణ సీరియస్‌గా జరగడం లేదు: కవిత

January 29, 2026

kalvakuntla kavitha: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసుల ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

Read More
Medaram Jathara: మేడారం అభివృద్ధికి కేంద్రం సాయం చేయలేదు: మంత్రి పొంగులేటి
Medaram Jathara: మేడారం అభివృద్ధికి కేంద్రం సాయం చేయలేదు: మంత్రి పొంగులేటి

January 29, 2026

minister ponguleti srinivas: మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ప్రకటన అబద్ధం అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నయా పైసా సాయం కూడా చేయలేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Read More
Page 1 of 5(109 total items)