_1773989132395.jpg&w=1920&q=80)
March 20, 2026
earthquake: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. శుక్రవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో చేవేళ్ల పట్టణం, పరిసర గ్రామాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది (earthquake). ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు సాగినప్పటికీ, ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రకంపనల ధాటికి ఇళ్లలోని పాత్రలు, ఇతర వస్తువులు కింద పడిపోవడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. చేవేళ్ల పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది.
Read More

_1770718161771.png&w=1920&q=80)


_1767971694823.png&w=1920&q=80)



















