Home/Tag: Andhrapradesh News
Tag: Andhrapradesh News
Weather report:ఏపీలో డబుల్ ఎఫెక్ట్.. ఎండలు ఒకవైపు.. పిడుగులతో వర్షాలు మరోవైపు!
Weather report:ఏపీలో డబుల్ ఎఫెక్ట్.. ఎండలు ఒకవైపు.. పిడుగులతో వర్షాలు మరోవైపు!

April 20, 2026

weather report:ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వాతావరణం విభిన్న రూపంలో కనిపిస్తోంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. apsdma ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకారం.. నేడు రాష్ట్రంలోని 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 17 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

Read More
Deputy CM:పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సమయం అవసరం
Deputy CM:పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సమయం అవసరం

April 19, 2026

deputy cm pawan kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రమైన అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి తరలించారు.

Read More
Chandrababu:మహిళలకు ద్రోహం.. జాతికి ద్రోహం చేసినట్లే:చంద్రబాబు
Chandrababu:మహిళలకు ద్రోహం.. జాతికి ద్రోహం చేసినట్లే:చంద్రబాబు

April 18, 2026

chandrababu comments:నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మహిళలకు న్యాయం చేయాలని, వారి ఆశలను నిలబెట్టాలని కేంద్రం తీసుకువచ్చిన బిల్లును అడ్డుకోవడం దేశానికి వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు.

Read More
Anakapalli Earthquake:రాంబిల్లి తీరంలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదు!
Anakapalli Earthquake:రాంబిల్లి తీరంలో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదు!

April 17, 2026

anakapalli earthquake:అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు సంభవించాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు రాంబిల్లి మండలంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు సమాచారం. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మంచాలు, ఫర్నిచర్ కంపించడంతో భయాందోళనలకు గురయ్యారు.

Read More
Weather report:ఏపీలో ఎండల దాడి.. 45°C దాటిన ఉష్ణోగ్రతలు, ప్రజలకు APSDMA అలర్ట్
Weather report:ఏపీలో ఎండల దాడి.. 45°C దాటిన ఉష్ణోగ్రతలు, ప్రజలకు APSDMA అలర్ట్

April 17, 2026

weather report:ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ అధికమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (apsdma) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి ఎంత తీవ్రమైందో స్పష్టంగా చూపుతోంది. కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 44.2 డిగ్రీలు నమోదయ్యాయి.

Read More
Student Phone Call:ఆన్సర్ షీట్‌లో డబ్బులు పెట్టా… నన్ను పాస్ చేయండి అంటూ అధికారులకు కాల్
Student Phone Call:ఆన్సర్ షీట్‌లో డబ్బులు పెట్టా… నన్ను పాస్ చేయండి అంటూ అధికారులకు కాల్

April 16, 2026

student phone call to inter board asking to pass him:ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఫలితాలు విడుదలకాకముందే ఇంటర్ బోర్డు అధికారులకు ఫోన్ చేసి తనను ఎలాగైనా పాస్ చేయాలని వేడుకున్నాడు.

Read More
Road accident in Kurnool:మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 8మంది మృతి
Road accident in Kurnool:మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 8మంది మృతి

April 16, 2026

road accident in kurnool:గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 12మందికి తీవ్రగాయాలయ్యాయి.

Read More
Anudeep Katikala arrest: స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్..
Anudeep Katikala arrest: స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్..

April 15, 2026

anudeep katikala arrest: కామెడీ పేరుతో హద్దులు దాటిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాకినాడ పోలీసులు అతడిని ఉత్తర ప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.

Read More
AP Minister Nara Lokesh: కసి, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించండి..
AP Minister Nara Lokesh: కసి, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించండి..

April 14, 2026

ap minister nara lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (ap minister nara lokesh) అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారిలోని సాహస గుణాన్ని వెలికితీసేందుకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (everest base camp) యాత్రను అమరావతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదని, విభిన్న ప్రతిభావంతుల సంకల్పానికి నిదర్శనమని ఆయన కొనియాడారు.

Read More
Tirumala:తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో మార్పు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు
Tirumala:తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో మార్పు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు

April 14, 2026

tirumala:కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. రోజువారీగా వేలాదిమంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తుండటంతో, దర్శన ఏర్పాట్లలో సమయానుకూల మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (ttd) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Read More
Andhra Pradesh:గ్రామాలకు అన్నదానం.. ఏపీలో 62 కొత్త అన్న క్యాంటీన్లు
Andhra Pradesh:గ్రామాలకు అన్నదానం.. ఏపీలో 62 కొత్త అన్న క్యాంటీన్లు

April 14, 2026

ap 62 new anna canteens:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ పథకాన్ని మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రధానంగా నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ క్యాంటీన్లను ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 అన్న క్యాంటీన్లను ప్రారంభించనుంది.

Read More
Visakhapatnam:బీచ్ రోడ్డులో ఐస్‌క్రీమ్ బండిపై బంగారం అమ్మకం.. వీడియో వైరల్!
Visakhapatnam:బీచ్ రోడ్డులో ఐస్‌క్రీమ్ బండిపై బంగారం అమ్మకం.. వీడియో వైరల్!

April 13, 2026

visakhapatnam:విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం సందడి వాతావరణం మధ్య ఓ విభిన్నమైన దృశ్యం సందర్శకులను ఆకట్టుకుంది. సాధారణంగా ఐస్‌క్రీమ్, బజ్జీలు అమ్మే తోపుడు బండ్లు కనిపించే ఆర్కే బీచ్ ప్రాంతంలో ఈసారి ఒక ప్రత్యేకమైన బండి అందరి దృష్టిని ఆకర్షించింది. సబ్‌మెరైన్ మ్యూజియం ఎదురుగా నిలిపిన ఆ బండి పై ఐస్‌క్రీమ్‌ల బదులుగా బంగారు ఆభరణాలు, నాణేలను విక్రయించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

Read More
IT Minister:ఢిల్లీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం
IT Minister:ఢిల్లీలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం

April 13, 2026

nara lokesh arrives in delhi:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ వారితో ఆప్యాయంగా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సంక్షిప్తంగా చర్చించారు.

Read More
Andhra Pradesh:ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ ఆలస్యం.. అసలు కారణం ఇదే!
Andhra Pradesh:ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ ఆలస్యం.. అసలు కారణం ఇదే!

April 12, 2026

inter 1st 2nd results update:ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళే (ఏప్రిల్ 12) ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో, ఏపీ విద్యార్థుల్లో కూడా ఉత్కంఠ మరింత పెరిగింది. మొదటగా ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలు వస్తాయని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల ఆలస్యం చోటుచేసుకుంది.

Read More
AP Government:ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు రెండేళ్ల తర్వాత అమ్మకానికి గ్రీన్ సిగ్నల్
AP Government:ఏపీలో పేదలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు రెండేళ్ల తర్వాత అమ్మకానికి గ్రీన్ సిగ్నల్

April 11, 2026

ap government takes key decision:అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల విక్రయ నిబంధనలలో ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 2024లో పట్టాలు పొందిన వారు కూడా రెండేళ్ల తర్వాత తమ స్థలాలను అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.

Read More
Kadapa:ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. కాళ్లకి గాయాలు
Kadapa:ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు.. కాళ్లకి గాయాలు

April 11, 2026

kadapa:కడప జిల్లా ఖాజీపేట మండలంలో జరిగిన దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. అగ్రహారం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు వెంకటేశ్, ఆమెను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు.

Read More
Weather Report:రాష్ట్రంలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు… మరోవైపు పిడుగుల హెచ్చరికలు!
Weather Report:రాష్ట్రంలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు… మరోవైపు పిడుగుల హెచ్చరికలు!

April 11, 2026

ap rains and high temperatures:ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Read More
Sajjala Ramakrishna Reddy: అమరావతికి చట్టబద్దత అనేది ఓ భ్రమ
Sajjala Ramakrishna Reddy: అమరావతికి చట్టబద్దత అనేది ఓ భ్రమ

April 10, 2026

sajjala ramakrishna reddy: రాజధాని అమరావతి నిర్మాణంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి చట్టబద్ధత అనే అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది కేవలం ఒక భ్రమ మాత్రమేనని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read More
Tirumala:తిరుమల వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం.. తమిళనాడు నిందితుడి అరెస్ట్!
Tirumala:తిరుమల వీఐపీ దర్శనం పేరుతో భారీ మోసం.. తమిళనాడు నిందితుడి అరెస్ట్!

April 10, 2026

tirumala vip break darshan cheater arrested:కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తామంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న దళారుల ఆటకట్టు కట్టారు పోలీసులు. టీటీడీ (ttd) లోగోను వాడుతూ సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలు జారీ చేసి, భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More
Weather Report:ఏపీలో డబుల్ అటాక్.. ఒకేసారి ఎండలు, వానలు!
Weather Report:ఏపీలో డబుల్ అటాక్.. ఒకేసారి ఎండలు, వానలు!

April 10, 2026

ap high temperatures and rains:ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని apsdma వెల్లడించింది. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read More
Deputy CM Pawan Kalyan: 30 ఏళ్ల తాగునీటి కష్టాలకు చెక్..
Deputy CM Pawan Kalyan: 30 ఏళ్ల తాగునీటి కష్టాలకు చెక్..

April 9, 2026

deputy cm pawan kalyan: ‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. గురువారం రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.

Read More
Mavigan: ‘రావాలి జగన్.. కావాలి మావిగన్’.. జగన్ ఇంటి వద్ద ఫ్లెక్సీల హడావుడి
Mavigan: ‘రావాలి జగన్.. కావాలి మావిగన్’.. జగన్ ఇంటి వద్ద ఫ్లెక్సీల హడావుడి

April 9, 2026

mavigan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'మావిగన్' (mavigan) పేరు మరోసారి తెరపైకి రావడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తాడేపల్లిలోని వైఎస్ జగన్ (ys jagan mohan reddy) నివాసం వద్ద వెలిసిన ఈ ఫ్లెక్సీలు కేవలం నినాదాలు మాత్రమే కాకుండా, రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే రాజకీయ వ్యూహానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి వైసీపీ శ్రేణులు మద్దతు ప్రకటిస్తున్నాయి.

Read More
CM Chandrababu:జాక్‌పాట్ దక్కినా పనితీరు ఎక్కడ..? మంత్రిపై సీఎం సీరియస్
CM Chandrababu:జాక్‌పాట్ దక్కినా పనితీరు ఎక్కడ..? మంత్రిపై సీఎం సీరియస్

April 9, 2026

review meeting in undavalli:విజయనగరం జిల్లాలో రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది.

Read More
CM Chandra babu: రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి
CM Chandra babu: రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి

April 8, 2026

cm chandra babu: రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, రహదారుల నాణ్యతను పెంచడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రహదారులు, భవనాలు, రవాణా శాఖలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.

Read More
Pawan Kalyan:విమర్శలపై ప్రజాస్వామ్య రీతిలో స్పందించాలి: డిప్యూటీ సీఎం
Pawan Kalyan:విమర్శలపై ప్రజాస్వామ్య రీతిలో స్పందించాలి: డిప్యూటీ సీఎం

April 8, 2026

pawan kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య విధానాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇటీవల ఒక మీడియా ఛానెల్‌పై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందిస్తూ, గతంలో జగన్ సీఎం హోదాలో పాఠశాల విద్యార్థుల సమక్షంలో అసభ్యమైన మాటలు మాట్లాడారని గుర్తు చేశారు.

Read More
Page 1 of 25(625 total items)