Home / తాజా వార్తలు
ఇటీవల కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యను చంపిన భర్త ఉదంతం మరవక ముందే అలాంటిదే మరో సంఘటన తాజాగా జరిగింది. వంట రుచిగా చేయలేదని ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమెను హతమార్చిన సంఘటన హైదరాబాద్ లోని, బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
న్నికల వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రది మోదీ పై విరుచుకు పడుతున్నారు .మోదీ తెలంగాణకు చేసింది ఏమి లేదు గాడిద గుడ్డు అంటూ సెటైరికల్ గా ప్రచారం చేతున్న రేవంత్ రెడ్డి తాజాగా మరో సారి హాట్ కామెంట్స్ చేసారు . రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఇండియా కూటమిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ లా కనిపిస్తోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో మమతా బెనర్జీకి.. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది.
కర్ణాటకలో ప్రస్తుతం ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కాండిల్ హాట్ టాపిక్గా మారింది. అయితే స్కాండిల్ వెలుగు చూసిన వెంటనే ప్రజ్వల్ దేశం నుంచి జర్మనీకి పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ తొలిసారి ఒక ప్రకటన విడుదల చేశాడు. వాస్తవాలు నిలకడగా వెలుగు చూస్తాయని, తాను అమాయకుడినని ప్రకటనలో పేర్కొన్నాడు.
లీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసు కస్టడీలోనే ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అనుజును సమీపంలోని గోకుల్దాస్ తేజ్పాల్ ఆస్పత్రికి తరలించారు.. డాక్టర్లు పరీక్ష జరిపి చనిపోయాడని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
గాజు గ్లాసు సింబల్పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..
మూడు హామీలు తప్ప తమ మేనిఫెస్టోలోని అన్ని విషయాలు అమలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా, సంపూర్ణ మద్య నిషేధం, సిపిఎస్ రద్దు… ఈ మూడు హామీలు తప్ప 99 శాతం హామీలు అమలుచేశామని ఆయన తెలిపారు.
ఏపీ సీఎం జగన్ కు చెల్లెలు వైఎస్ షర్మిల తాజాగా లేఖాస్త్రం సంధించారు . ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న 'నవ సందేహాలు'కు సమాధానం చెప్పాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంవత్సరాల తరబడి అందుతున్న పధకాలను ఎందుకు నిలిపివేసారని ఆమె ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10.4 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు మాత్రం తూర్పు ఇండియాతో పాటు పశ్చిమబెంగాల్లో నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని కలైకుండాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.
దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. రెండు విడతల పోలింగ్ కూడా ముగిసింది. మూడో విడత పోలింగ్ మే 7న జరుగనుంది. మూడవ విడతలో మొత్తం 12 రాష్ర్టాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 94 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అయితే దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ మాత్రం గాంధీలకు కంచుకోట అయిన అమెథీ, రాయబరేలీ మీదే ఉన్నాయి.