Home / Rajamahendravaram
అమరావతి నుండి అరసవళ్లి వరకు తలపెట్టిన అమరాతి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభం నాటి నుండి వైకాపా శ్రేణులు పదే పదే వారిని రెచ్చగొడుతున్నారు. విధ్వంసానికి కవ్విస్తున్నారు. నేడు రాజమహేంద్రవరంలో పాదయాత్ర చేస్తున్న రైతులపై నీళ్ల బాటిళ్లు, చెప్పులు విసిరి వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు నానా యాగీ చేశారు.
ఏపీలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు రెచ్చగొడుతూ వారిపై నీళ్ల బాటిళ్లను విసిరారు. దీంతో రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది.