Home / Rahul Gandhi
భారత్ జోడో యాత్ర రెండో దశ ఈ ఏడాది డిసెంబర్ మరియు ఫిబ్రవరి 2024 మధ్య జరిగే అవకాశం ఉందని మంగళవారం కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు గత ఏడాది సెప్టెంబర్ 7 నుండి జనవరి 30, 2023 వరకు మొదటి దశ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్కు బై బై చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన ప్రసంగించారు.
చాలా మంది ప్రతిపక్ష నేతల ఫోన్లు టేప్ అవుతున్నాయని, మొబైల్ దిగ్గజం యాపిల్ పంపిననోటిఫికేషన్ను ఉటంకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. తమ ఐఫోన్లను స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్లు రిమోట్గా రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజస్థాన్, కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ కుల గణన చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.పార్టీ విజయ భేరి యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి జిల్లా కాటారం ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ ఇచ్చామని, అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చినా సామాజిక న్యాయం దక్కలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆమె ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేసారని ధ్వజమెత్తారు.
బొగ్గు దిగుమతుల్లో అదానీ గ్రూప్ ఓవర్ ఇన్వాయిస్ చేసి రూ. 32,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బుదవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అదానీ గ్రూప్పై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.