Home / Nagababu
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాలను కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
Nagababu: వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు, జనసేన నేత నాగబాబుకు పార్టీలో పదోన్నతి ఇచ్చారు. నాగబాబు ఇప్పటి వరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే తాజాగా నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు
అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో నటించి మెప్పించారు వాసుకి. వాసుకీ అలియాస్ పాకీజా.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఎన్నో అద్భతమైన సినిమాల్లో నటించారు.
Nagababu On Alliances: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన నాగబాబు.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కర్నూలులో జనసేన నేతలు.. వీర మహిళలతో నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. […]
Nagababu In Kurnool: జనసేన అధికారంలోకి రాగానే సుగాలీ ప్రీతి కేసుపై ప్రత్యకే దృష్టి పెడతామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు గారు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులతో నాగబాబు సుదీర్ఘంగా చర్చించారు. తాము అధికారంలో రాగానే.. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. కర్నూలులో రెండు రోజుల పర్యటనలో […]
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసై వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
Janasena Yuvashakthi: వైసీపి పాలనే అంతంగా యువత పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని పవన్ కళ్యాణ్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తుందో సభా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించారు. ఇక విజయనగరానికి చెందిన హుస్సేన్ ఖాన్ అనే యువకుడు […]