Home / Kerala
బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ను హత్య చేసిన కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి చెందిన 15 మంది వ్యక్తులకు మరణశిక్ష విధిస్తూ కేరళ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబర్లో రంజిత్ హత్యకు గురయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేరళలోని కొచ్చిలో 4 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను నాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.
కేరళలో కొత్త కోవిడ్ సబ్వేరియంట్ JN.1 కేసు నమోదైంది. 79 ఏళ్ల మహిళ కు నవంబర్ 18న జరిగిన RT-PCR పరీక్షలో పాజిటివ్గా తేలడంతో డిసెంబర్ 8న ఈ కేసు నమోదైంది. ఆమె ఇన్ఫ్లుఎంజా లాంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు కనపడినా తరువాత తేరుకుంది.
కేరళలోని ఒక పెంపుడు కుక్క కన్నూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ ముందు తన యజమాని కోసం వేచి ఉంది. అక్కడ గత నాలుగు నెలలు కిందట మరణించిన తన యజమాని తిరిగి వస్తాడని భావిస్తూ అక్కడే తిరుగుతోంది. ఆసుపత్రి ఉద్యగులు అక్కడికి వచ్చేవారు కుక్క కు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు విస్తుపోతున్నారు.
కేరళలోని కొచ్చిలోని కలమస్సేరి ప్రాంతంలోని కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన పలు పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించిందని, ఆ తర్వాత గంట వ్యవధిలో పలు పేలుళ్లు జరిగాయని కలమసేరి సీఐ విబిన్ దాస్ తెలిపారు.
ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్లను సరఫరా చేస్తోంది.
కేరళలోని కొట్టాయంలో ఒక అనుమానాస్పద మాదకద్రవ్యాల వ్యాపారి ఇంటిపై దాడి చేసిన పోలీసులపై ఒక్కసారిగా పలు కుక్కలు దాడి చేసాయి. ఖాకీ దుస్తులు ధరించిన వారిని కరిచేలా వాటికి ట్రైనింగ్ ఇచ్చారని తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. కుక్కల దాడులనుంచి కాపాడుకోవడంపై పోలీసులు దృష్టి సారించడంతో నిందితులు తప్పించుకోవడానికి వీలు కలిగింది.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ యొక్క కొత్త కేసును ధృవీకరించారు. దీనితో మొత్తం బాధిత వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరుకుంది.ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకిందని మంత్రి తెలిపారు.
కేరళలోని కోజికోడ్లో జ్వరం కారణంగా రెండు "అసహజ మరణాలు" నమోదవడంతో ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ మరణాలకు నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణమని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. కోజికోడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఇద్దరు మృతి చెందారు.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.