Home / Congress Party
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో మనస్థాపం చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని అయినా ఆశ్చర్యకరంగా తనకి టికెట్ నిరాకరించారని నాగం జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
: ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయాడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎల్బీ నియోజక వర్గంలో నిర్వహించిన బీఆర్ఎస బూత్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాహుల్ గాంధీ విజయభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు గాయాలయ్యాయి. భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న సురేఖ.. స్కూటీ నడుపుతున్న క్రమంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. అయితే వెంటనే.. పక్కన ఉన్న వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని లక్ష్మయ్య రాజీనామా చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
నేడు ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ జరగనుంది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హజరుకానున్నారు. జూపల్లి పొంగులేటితో పాటు పలువురు నాయకులు హస్తం గూటికి చేరటంతో పాటు. పార్టీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ సభతో ముగియబోతుంది.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక సీఎం పోస్టు కోసం రేసులో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, కాంగ్రెస్ సర్కారు గురించి, వైకాపా ప్రభుత్వం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో.. భాజపా పై విమర్శలు చేసిన సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి విరమణపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
MP Komatireddy: తెలంగాణలో వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది.