The government wants to give new salaries: ఏపీలో పీఆర్సీ వార్ కొనసాగుతోంది. ఎలాగైన ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ట్రెజరీలకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కొత్త పీఆర్సీ ప్రకారమే ట్రెజరీలకు ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. జనవరి నెలకు తమకు పాత జీతాలు ఇస్తేనే చర్చలకు వస్తామని ఓ పక్క ఉద్యోగ సంఘాలు చెబుతుంటే.. మరోవైపు ఉద్యోగులు చర్చలకు పిలిస్తేనే.. తాము వస్తామని మంత్రులు స్పష్టం చేశారు. దీంతో పీఆర్సీ వ్యవహారం ఎటూ తేలడం లేదు.
కొత్త పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారమే ఉద్యోగులకు జనవరి జీతాలు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను రంగంలోకి దింపింది. జనవరి 28 తేదీ గడిచినా ఉద్యోగులు ఎవరూ కొత్త వేతన సవరణ ప్రకారం బిల్లులు సమర్పించేందుకు ముందుకు రాలేదు. చాలామంది ఉద్యోగులు తమ డ్రాయింగు డిస్బర్స్మెంటు అధికారులకు కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే ఇవ్వాలి అంటూ లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించారు. ఫలితంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనేకమంది డీడీవోలు ఇప్పటికీ బిల్లులను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు అన్ని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీడీవోలు బిల్లులను సమర్పించేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అధికారుల ఒత్తిడితో డీడీవోలు సందిగ్ధంలో పడ్డారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్
భద్రాద్రిలో ఘోర రోడ్డుప్రమాదం నలుగురు కూలీల మృతి
The government wants to give new salaries: ఏపీలో పీఆర్సీ వార్ కొనసాగుతోంది. ఎలాగైన ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ట్రెజరీలకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కొత్త పీఆర్సీ ప్రకారమే ట్రెజరీలకు ఆర్ధిక శాఖ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. జనవరి నెలకు తమకు పాత జీతాలు ఇస్తేనే చర్చలకు వస్తామని ఓ పక్క ఉద్యోగ సంఘాలు చెబుతుంటే.. మరోవైపు ఉద్యోగులు చర్చలకు పిలిస్తేనే.. తాము వస్తామని మంత్రులు స్పష్టం చేశారు. దీంతో పీఆర్సీ వ్యవహారం ఎటూ తేలడం లేదు.
కొత్త పీఆర్సీ ఉత్తర్వుల ప్రకారమే ఉద్యోగులకు జనవరి జీతాలు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను రంగంలోకి దింపింది. జనవరి 28 తేదీ గడిచినా ఉద్యోగులు ఎవరూ కొత్త వేతన సవరణ ప్రకారం బిల్లులు సమర్పించేందుకు ముందుకు రాలేదు. చాలామంది ఉద్యోగులు తమ డ్రాయింగు డిస్బర్స్మెంటు అధికారులకు కొత్త జీతాలు వద్దు, పాత జీతాలే ఇవ్వాలి అంటూ లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించారు. ఫలితంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనేకమంది డీడీవోలు ఇప్పటికీ బిల్లులను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు అన్ని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడారు. డీడీవోలు బిల్లులను సమర్పించేలా చూడాలని ఆదేశించారు. జిల్లా అధికారుల ఒత్తిడితో డీడీవోలు సందిగ్ధంలో పడ్డారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్
భద్రాద్రిలో ఘోర రోడ్డుప్రమాదం నలుగురు కూలీల మృతి
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022