RTC employees on strike in AP: పీఆర్సీ జీవోల రద్దు, పలు పెండింగు అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అన్ని రకాల ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ... ఇపుడు ఉన్న సౌకర్యాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా ఇవాల్టినుంచి నిరసన దీక్షల్లో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 3, 4 తేదీలలో అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ సాధన సమితి ప్రకటించినట్లుగా.. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ప్రకటించాయి. ఆర్టీసీ యూనియన్ల నిర్ణయంతో ఈ నెల ఆరో తేది అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోతే అది సామాన్యులపైనా.. ప్రభుత్వ ఖజానాపై పెను ప్రభావం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పీఆర్సీ ఉచ్చునుంచి బయటపడేందుకు జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఆర్టీసీలో పది సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఫిబ్రవరి ఏడు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017లో చెల్లించాల్సిన ఎరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చకుండా .ఆర్టీసీ ఆదాయం మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోందని బొప్పరాజు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టాలి.. అక్కినేని అభిమానుల డిమాండ్
హీరో విజయ్ రోల్స్ రాయిస్ కేసు: సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యలను తొలగించిన మద్రాస్ హైకోర్టు
RTC employees on strike in AP: పీఆర్సీ జీవోల రద్దు, పలు పెండింగు అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అన్ని రకాల ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామన్న ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ... ఇపుడు ఉన్న సౌకర్యాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీఆర్సీ సాధన సమితికి మద్దతుగా ఇవాల్టినుంచి నిరసన దీక్షల్లో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 3, 4 తేదీలలో అన్ని డిపోల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీఆర్సీ సాధన సమితి ప్రకటించినట్లుగా.. ఫిబ్రవరి 07వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ప్రకటించాయి. ఆర్టీసీ యూనియన్ల నిర్ణయంతో ఈ నెల ఆరో తేది అర్థరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోతే అది సామాన్యులపైనా.. ప్రభుత్వ ఖజానాపై పెను ప్రభావం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పీఆర్సీ ఉచ్చునుంచి బయటపడేందుకు జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఆర్టీసీలో పది సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమానికి మద్దతు ఇచ్చాయని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఫిబ్రవరి ఏడు నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొనేందుకు అన్ని సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2017లో చెల్లించాల్సిన ఎరియర్స్ ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు తీర్చకుండా .ఆర్టీసీ ఆదాయం మాత్రమే ప్రభుత్వం కోరుకుంటోందని బొప్పరాజు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టాలి.. అక్కినేని అభిమానుల డిమాండ్
హీరో విజయ్ రోల్స్ రాయిస్ కేసు: సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యలను తొలగించిన మద్రాస్ హైకోర్టు
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022