Hindupuram Bandh today: కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం హిందూపురం పా ర్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసంతృప్తి సెగలు రాజేస్తోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసా యి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనితో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా నిర్ణయించడాన్ని హిందూపురంవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లోకసభ నియోజకవర్గ కేంద్రా న్ని కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రం గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, వ్యాపార, వాణిజ్య సౌకర్యాలున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆ ప్రాంత అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయానికి తావు ఇవ్వవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం పట్టణానికి చెందిన వైసీపీయేతర పక్షాలన్నీ ఒకటిగా ఏర్పడి హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నినదిస్తున్నాయి. డిమాండ్ సాధన కోసం శనివారం హిందూపురం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు.
హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వవస్థీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
దేశంలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ
మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ... ఒక మహిళ ప్రయాణం
Hindupuram Bandh today: కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారం హిందూపురం పా ర్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసంతృప్తి సెగలు రాజేస్తోంది. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసా యి జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనితో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా నిర్ణయించడాన్ని హిందూపురంవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లోకసభ నియోజకవర్గ కేంద్రా న్ని కాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రం గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు, వ్యాపార, వాణిజ్య సౌకర్యాలున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆ ప్రాంత అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయానికి తావు ఇవ్వవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూపురం పట్టణానికి చెందిన వైసీపీయేతర పక్షాలన్నీ ఒకటిగా ఏర్పడి హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నినదిస్తున్నాయి. డిమాండ్ సాధన కోసం శనివారం హిందూపురం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు.
హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే. జిల్లాల పునర్వవస్థీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి
దేశంలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ
మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ... ఒక మహిళ ప్రయాణం
Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022