Home / పొలిటికల్ వార్తలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. దీనికి ప్రతిగా తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేయమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.
కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొoడి హరిరామ జోగయ్య నేటి రాజకీయం పేరుతో బహిరంగ లేఖ రాశారు. జనసేన పార్టీకు 25 నుంచి 30 సీట్లు ఇస్తే.. సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోతున్నారని జోగయ్య అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గాలు లేదా తణుకు, నిడదవోలు నియోజక వర్గాలు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఒక పక్క పార్టీలో పెరుగుతున్న చేరికలు, మరోవైపు గాజు గ్లాసు గుర్తు ఖరారు చేయడం శుభ సంకేతాలని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంతో 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మెుదటిసారి పవన్తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్తో చర్చించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.